Actress Prema: కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నటువంటి ప్రేమ ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ప్రేమ అనంతరం పలు సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఈమె దేవత పాత్రలలో నటించి నిజంగానే దేవత అని భావన కలిగేలా నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.
ఈ విధంగా ప్రేమ ఎంత తొందరగా స్టార్ హీరోయిన్ అయిందో అంతే తొందరగా ఇండస్ట్రీలో ఫెయిడౌట్ అయింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ఈమె సహాయనటిగా మారిపోయారు.ఈ విధంగా ప్రేమ సహాయ నటిగా మారిపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నటిగా కొనసాగుతున్న నేను సహాయనిటిగా మారడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ఈమె దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో చిరునవ్వుతో అనే సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ సినిమాలో తన పాత్ర బావతో పెళ్లిని తిరస్కరించి ఓ మోసగాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించాను.అయితే ఈ సినిమా కథ విన్న సమయంలో ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఉందా అని ప్రశ్నించగా త్రివిక్రమ్ మాత్రం కథ మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది అంటూ నన్ను బలవంతంగా ఈ పాత్రలో నటించడానికి ఒప్పించారు.
త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశారు…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్ర గురించి అంతలా చెప్పడంతో కేవలం ఆయనపై నమ్మకంతోనే చిరునవ్వుతో సినిమాలో చేశానని ఈమె వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కాగా తన పాత్ర హీరోయిన్ పాత్ర కాదని సహాయ నటి పాత్ర అని తెలిసింది.ఈ సినిమా అనంతరం నాకు సహాయ నటి పాత్రలలో అవకాశాలు వస్తున్నాయని కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తాను హీరోయిన్ నుంచి సహాయ నటిగా మారిపోయాను అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…