Actress Srilakshmi : ఒకప్పటి సినీ నటుడు, శ్రీ లక్ష్మీ తండ్రి అమర్నాథ్ చిన్నతనంలోనే చనిపోవడంతో, శ్రీలక్ష్మి ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో ఆవిడ సినిమాల్లోకి రావాల్సివచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం సినిమా, బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాలలో కథానాయిక అవకాశం వచ్చిందికానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాల్లో చేయలేకపోయింది. అక్కినేని నటించిన గోపాలకృష్ణుడు సినిమాలోని ఒక పాటలో అక్కినేని పల్లవికో అమ్మాయితో కనిపిస్తాడు. అమరనాథ్గారి అమ్మాయినే పెట్టండి. వాళ్ల కుటుంబానికి సాయం చేసినవారం అవుతాం అని అక్కినేని చెప్పడంతో ఒక అమ్మాయికోసం శ్రీలక్ష్మిని తీపుకున్నారు.
అక్కినేని పక్కన పంజాబీ డ్రస్ వేసుకొని శ్రీలక్ష్మి డాన్స్ చేసింది. అయినా అవకాశాలు రాలేదు. కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన నివురుగప్పిన నిప్పులో మొదటిసారి కమెడియన్ గా (నగేష్ పక్కన) చేశారు. సినిమా విజయం సాధించలేదుకానీ, శ్రీలక్ష్మి పాత్ర సూపర్ హిట్టయ్యింది. తర్వాత జంధ్యాల గారి రెండుజెళ్ళ సీతలో చిన్న అవకాశం దొరికింది. ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ శ్రీలక్ష్మిగారి టాలెంట్ని గుర్తించి, క్యారెక్టర్ని పొడిగించారు. ఆతర్వాత జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆ పాత్రతో ఆమె హాస్యనటిగా స్థిరపడడంతో వరసగా 13 ఏళ్ళపాటు అదే పురస్కారం పొందారు..
1985, అల్లు అరవింద్ నిర్మాణం, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజేత చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, భానుప్రియ హీరో హీరోయిన్లుగా నటించారు. మధ్యతరగతి కుటుంబాన్ని నడుపుతున్న ఓ తండ్రి కుమారుల్లో చివరివాడు చిరంజీవి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి పేదరికం అడ్డుగా వస్తుంది. ఆ క్రమంలో ఫుట్ బాల్ ప్లేయర్ అయిన చిన్న కుమారుడు తన కిడ్నీ అమ్మి చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ అంశం.. అయితే ఈ సినిమాలో చిరంజీవికి వదినగా నటించినా శ్రీలక్ష్మి సినిమాలో ఓ సన్నివేశంలో.. తెగిన చెప్పును చిరంజీవిచే కుట్టించుకు రమ్మంటుంది…
ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న శ్రీలక్ష్మి చిరంజీవిచే ఆ రోజుల్లో అలా చేయించడం ద్వారా అతని ఫాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. మా హీరోతో అలా చేయిస్తావా అంటూ చిరంజీవి ఫ్యాన్స్ అడిగారన్నారు. కానీ చిరంజీవి షూటింగ్ సమయంలో చాలా సరదాగా ఉండేవారని అప్పట్లో క్యారవాన్స్ లేవని ఆర్టిస్టులందరూ ఒకే కుటుంబం లాగా ఒకే దగ్గర కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకునే వారమని ఇప్పుడు క్యారవాన్స్ ఉండడం మూలంగా షూటింగ్ గ్యాప్ లో ఎవరికి వారు క్యారవాన్స్ కి వెళ్లి ఉంటున్నారని అప్పటి రోజులు తిరిగి రావని.. ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ ఆర్టిస్టు శ్రీలక్ష్మి గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…