Puri Jagannadh: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ కు ఇలాంటి ఎత్తు పల్లాలు సర్వసాధారణం ఆయన ఇలాంటి డిజాస్టర్స్ ఎదుర్కొన్న తిరిగి బౌన్స్ అవుతూ తిరిగి ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నారు.
లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్న పూరి జగన్నాథ తాజాగా తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో ఫిలాసఫీలు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోని తాజాగా తడ్కా గురించి తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తడ్కా అంటే తాలింపు.మనం ఒక విషయం గురించి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దగ్గరకు పంపిస్తే ఆ వ్యక్తి తిరిగి మన దగ్గరకు వచ్చేలోపు మొత్తం తాలింపు అవుతుందని తెలిపారు.
అవతల వ్యక్తి దగ్గరికి పంపించిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి వాడికి ఎక్కువైపోయింది. ఇది మంచి రోజులు కావాన్న, నువ్వు వాడికి ఎంత చేసావు అవన్నీ మర్చిపోయావు. నాలుగు డబ్బులు వచ్చేసరికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పురా అని అడిగినప్పుడు అసలు విషయం చెప్పడు. ఇలా లేనిపోనివన్నీ చెప్పి నీలో ఒక విలన్ ని చూసిన తర్వాత డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు అని తీరా వాడు చెప్పింది చెబుతాడు.
మిమ్మల్ని ఒక పని మీద ఎవరి దగ్గరికి అయినా పంపిస్తే ముందు వాళ్ళు ఏం చెప్పారు అది చెప్పి తరువాత వాళ్ళు అడిగితే ఇవన్నీ చెప్పండి. ఇలా చెప్పాల్సింది కాకుండా వేరేవి చెప్పి తడ్కా వేయొద్దు. ఇలా తాలింపు వేయడం వల్లే సగం జీవితాలు నాశనమైపోతున్నాయని, దయచేసి ఇలాంటి తడ్కాలని తగ్గిద్దాము అంటూ పూరి జగన్నాథ్ సందర్భంగా పూరి మ్యూజింగ్స్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…