Puri Jagannadh: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ కు ఇలాంటి ఎత్తు పల్లాలు సర్వసాధారణం ఆయన ఇలాంటి డిజాస్టర్స్ ఎదుర్కొన్న తిరిగి బౌన్స్ అవుతూ తిరిగి ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నారు.
లైగర్ డిజాస్టర్ తర్వాత సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉన్న పూరి జగన్నాథ తాజాగా తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో ఫిలాసఫీలు చెబుతూ ఉంటారు ఈ క్రమంలోని తాజాగా తడ్కా గురించి తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తడ్కా అంటే తాలింపు.మనం ఒక విషయం గురించి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దగ్గరకు పంపిస్తే ఆ వ్యక్తి తిరిగి మన దగ్గరకు వచ్చేలోపు మొత్తం తాలింపు అవుతుందని తెలిపారు.
అవతల వ్యక్తి దగ్గరికి పంపించిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి వాడికి ఎక్కువైపోయింది. ఇది మంచి రోజులు కావాన్న, నువ్వు వాడికి ఎంత చేసావు అవన్నీ మర్చిపోయావు. నాలుగు డబ్బులు వచ్చేసరికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పురా అని అడిగినప్పుడు అసలు విషయం చెప్పడు. ఇలా లేనిపోనివన్నీ చెప్పి నీలో ఒక విలన్ ని చూసిన తర్వాత డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు అని తీరా వాడు చెప్పింది చెబుతాడు.
మిమ్మల్ని ఒక పని మీద ఎవరి దగ్గరికి అయినా పంపిస్తే ముందు వాళ్ళు ఏం చెప్పారు అది చెప్పి తరువాత వాళ్ళు అడిగితే ఇవన్నీ చెప్పండి. ఇలా చెప్పాల్సింది కాకుండా వేరేవి చెప్పి తడ్కా వేయొద్దు. ఇలా తాలింపు వేయడం వల్లే సగం జీవితాలు నాశనమైపోతున్నాయని, దయచేసి ఇలాంటి తడ్కాలని తగ్గిద్దాము అంటూ పూరి జగన్నాథ్ సందర్భంగా పూరి మ్యూజింగ్స్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…