Actress Tabu: తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి టబు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. ఒకానొక సమయంలో తెలుగుతోపాటు తమిళ సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీకి దూరమైన బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా ఐదు పదుల వయసులో ఉన్నటువంటి ఈమె ఇప్పటికివివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతూనే వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నటి టబు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మొదటిసారి తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.టబూ తన సోదరి జన్మించిన తర్వాత కొన్ని కారణాలవల్ల తన తండ్రి తన తల్లికి విడాకులు ఇచ్చారని, వీరి బాగోగులన్నీ కూడా తన తల్లి చూసుకున్నారని ఈమె వెల్లడించారు.
ఈ విధంగా చిన్నప్పటి నుంచి తాను ఒంటరిగానే పెరిగానని, తన తండ్రి ప్రేమకు తాను నోచుకోలేదు అందుకే ఆయన జ్ఞాపకాలు నాకు లేవు అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన లేకపోయినా ఆయన ఇంటిపేరు మాత్రమే ఉందని ఈమె వెల్లడించారు. ఇకపోతే తన జీవితంలో ఎప్పుడూ కూడా తన తండ్రిని కలవలేదని ఈమె తెలిపారు.
ఇక తన సోదరి మాత్రం కొన్ని సందర్భాలలో తన తండ్రిని కలుస్తూ ఉన్నప్పటికీ తాను మాత్రం చిన్నప్పటినుంచి తాను పెరిగిన జీవితంలోనే ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఈ సందర్భంగా టబు మొదటిసారి తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక ప్రస్తుతం ఈమె వరస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ తెలుగులో కూడా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…