Adi Pinishetty – Nikki Galraani : దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా తమిళ్ లో హీరోగా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇటు తెలుగు లో కూడా గుండెల్లో గోదారి, ఒక వి చిత్రం, సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం వంటి చిత్రాలలో నటించి తెలుగులో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ హీరో గా వస్తున్న వారియర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఆది పినిశెట్టి, తాను ప్రేమించిన నిక్కి గల్రానీ తో మార్చ్ 24న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
తొలిసారి ఆది పినిశెట్టి, నిక్కీ 2015 లో వచ్చిన తమిళ చిత్రం ‘యాగవరాయినమ్ నా కాక్క’లో ఇద్దరు కలిసి నటించారు. ఇదే చిత్రం తెలుగులో కూడా ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తరువాత వచ్చిన ‘మరగాధ నాణ్యం’ సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని పెద్ద వాళ్ళతో ఒప్పించి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇపుడు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు.
వివాహ బంధం తో ఒక్కటైన ఆది- నిక్కి…..
Advertisement
కుటుంబ సభ్యుల సమక్షంలో ఆది పినిశెట్టి – నిక్కీగల్రానీల వివాహాం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఎప్పటినుండో ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, అతిథులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమం ఇంకా బుధవారం ఉదయం హల్దీ వేడుకలతో వీరి వివాహం జరిగింది. ఈ వివాహనికి ఇండస్ట్రీ నుంచి ఆదికి స్నేహితులు అయిన నాని, సందీప్ కిషన్ హాజరు అయినారు. పెళ్లి వేడుకలకు హాజరు అయిన నాని సందీప్ కిషన్ ఇద్దరు హల్దీ అనంతరం ఆది – నిక్కి లతో కలిసి స్టెప్పులేస్తూ అందరిని అలరించారు.
ఇక సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల కోసం కొత్త జంట త్వరలోనే రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఆది పినిశెట్టి – నిక్కీగల్రానీ ల వివాహనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూస్తున్న నెటీజన్లు ఆది నిక్కిల జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.