బోయపాటి శీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం “అఖండ” ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన లెజెండ్, సింహ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలోనే వీరి కాంబోలో తెరకెక్కుతున్నటువంటి అఖండ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు,పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇందులో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటించడమే కాకుండా మొట్టమొదటిసారిగా అఘోర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈ సినిమా నుంచి మొట్ట మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేశారు.
అడిగా.. అడిగా అంటూ సాగే ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. ఎస్ పి చరణ్, ఎం. ఎల్ శృతి ఈ పాటను పాడారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ , పూర్ణ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్, జగపతిబాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…