కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలిచి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిన రియల్ హీరో సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ అందరి పాలిట దేవుడిగా ఉన్నటువంటి సోను సూద్ పై గత మూడు రోజుల నుంచి ఐటీ దాడులు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికీ సోను సూద్ ఆఫీసులు నివాసాలు అతని సన్నిహితుల ఇంటిలో ఐటి అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.
ఈ విధంగా మూడు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నటువంటి ఐటీ అధికారులు సోనూసూద్ అతని సహచరులు సుమారు రూ.20 కోట్లు పన్ను ఎగ్గోట్టారని ఐటీ శాఖ అధికారులు తెలియజేశారు. కేవలం పన్ను ఎగర కొట్టడమే కాకుండా Foreign Contribution Act నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తుంది.
ఈ విధంగా సోనూసూద్ 20 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు అతనిపై దాడులను అధికారులు మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన 28 ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ తెలిపారు. కరోనా సమయంలో ఎందరికో అండగా నిలిచినటువంటి సోను సూద్ పై ఐటీ దాడులు నిర్వహించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఒకానొక సమయంలో సోను సూద్ పై ప్రశంసలు కురిపించిన బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం ఢిల్లీ -పంజాబ్ ప్రభుత్వాలు అతనితో సంబంధం కొనసాగిస్తున్న సమయంలో ఈ విధంగా ఐటీ దాడులు చేయించడం, సోనుసూద్ ను పన్ను ఎగవేత దారుడిగా ఆరోపిస్తున్నారంటూ శివసేన పార్టీ వ్యాఖ్యానించింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తన పూర్తి మద్ధతును సోనుసూద్ కి తెలుపుతూ ట్వీట్ చేశారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…