Aditya Pharmacy MD Narasimha Murthy Raju commits suicide
విజయవాడలోని అయోధ్య నగర్లో ఆదిత్య ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. క్షత్రియ భవన్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత ఏడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహ మూర్తి రాజు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి మానసిక ఒత్తిడిలో ఉన్న ఆయన, ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నరసింహ మూర్తి రాజు ఆధ్వర్యంలో ఆదిత్య ఫార్మసీ సంస్థ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. వినియోగదారులకు మితమైన ధరలపై మెడిసిన్లు అందిస్తూ విపణిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ సంఘటన వ్యాపార వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…