విజయవాడలోని అయోధ్య నగర్లో ఆదిత్య ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. క్షత్రియ భవన్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత ఏడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహ మూర్తి రాజు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి మానసిక ఒత్తిడిలో ఉన్న ఆయన, ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నరసింహ మూర్తి రాజు ఆధ్వర్యంలో ఆదిత్య ఫార్మసీ సంస్థ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. వినియోగదారులకు మితమైన ధరలపై మెడిసిన్లు అందిస్తూ విపణిలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ సంఘటన వ్యాపార వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
































