Adivi sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటారు. ఇలా శేష్ సినిమా వస్తుందంటే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి. ఇకపోతే తాజాగా ఈయన మేజర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని పాన్ ఇండియా స్థాయిలో ఈయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత శేష్ నటిస్తున్న చిత్రం హిట్ 2.ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా సినిమా గురించి వీరి చేసినటువంటి కామెంట్స్ కనుక వింటే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంలో చిత్ర బృందం ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో అడవి శేష్ సరసన బాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి నటించారు. మామూలుగా ముంబై హీరోయిన్లకు తెలుగు రాదు. వాళ్లు కేవలం సినిమా వేడుకలకు రావడం హాయ్ అందరికీ నమస్కారం అంటూ తిరిగి వెళ్లిపోవడం జరుగుతుంది.
ఈ క్రమంలోనే హిట్ 2 టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అడవి శేష్ ముంబై హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. ముంబై హీరోయిన్లు ఉంటారు కదా, ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అని మాత్రమే చెబుతారు కానీ మీనాక్షి చౌదరి మాత్రం అందరికీ నమస్కారం అని చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడారంటూ ఈయన ముంబై హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…