Ameesha Patel-Faisal Patel బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మదిని దోచుకున్న బ్యూటీ అమీషా పటేల్. తను అంతలా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తరవాత మహేష్ తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసినా పెద్దగా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది.
అటు బాలీవుడ్ లో కూడా పెద్దగా హిట్లు కూడా నమోదుకాలేదు. దీంతో కెరీర్ పరంగా అమీషా పటేల్ వెనకబడిపోయింది. అయితే ఈ అమ్మడు మాత్రం తన ఘాటు ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. 45 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో యువత మనసును దోచుకుంటుంది.
ఎప్పుడూ ఏదో ఓ ఫోటోతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ గురించి అమీషా పటేల్ ఎప్పుడూ సిక్రెట్ పాటిస్తుంది. ఇప్పటి వరకు లవ్, ఎఫైర్స్ వంటి వాటికి అమీషా పటేల్ దూరంగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది. అమీషా పటేల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నారనే వార్త నెట్టింట్ల వైరల్ గా మారింది.
దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిసెంబర్ 30న ఫైజల్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా.. అమిషా పటేల్ ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..‘‘ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రతిగా ఫైజల్ సంచలన రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ అమీషా.. నేను ఈ సందర్భంగా పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని రిప్లై ఇచ్చాడు. అయితే వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసినా.. అప్పటికే నెట్టింట ఇది వైరల్ గా మారింది.
దీంతో రానున్న రోజుల్లో అమీషా పటేల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 45 ఏళ్లకు చేరిన అమీషా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టెలా ఉంది. ఇదిలా ఉంటే ఫైజల్ అమీషా పటేల్ కన్నా మూడేళ్లు చిన్నవాడు. ఇప్పటికే ఫైజల్ పటేల్ కు వివాహం జరిగినా… 2016లో ఫైజల్ భార్య జైనాబ్ పటేల్ కార్డియాక్ సమస్యలతో మరణించారు. అయితే కొంత కాలంగా సింగిల్ గా ఉంటున్న ఫైజల్ పటేల్.. అమిషాతో ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…