కరోనా కారణంగా ఒక్క రంగంలోనే కాదు.. ప్రతీ విభాగం నష్టపోయింది. ఆర్థిక రంగం దగ్గర నుంచి పర్యాటక రంగం వరకు అన్నిటింకీ నష్టాలు తప్పలేదు. ఈ కోవలోకే ప్రయాణాలకు సంబంధించిన విభాగాల్లో కూడా నష్టం తప్పలేదు. లాక్ డౌన్ కాలంలో ఇంటి దగ్గరే ఉండటంతో వాహనరంగం కూడా కుదేలైంది. ముఖ్యంగా విమాన రంగాన్ని కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ తీసింది.
అయినా కానీ ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఈ సంస్థ డొమెస్టిక్ టికెట్ ధరలపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరుతో ఈ ఆఫర్ను ప్రారంభించింది. సేల్లో భాగంగా విమాన టికెట్లను రూ. 914 ప్రారంభ ధరతో అందిస్తోంది. అయితే దేశీయ ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది.
అయితే ఇవి కేవలం 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణానికి మాత్రమే. వీటికి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 మధ్య అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అంటూ ప్రకటించారు. ఇంఫాల్ నుంచి కోల్కతా, ఇంఫాల్ నుంచి గౌహతి మార్గాల మధ్య ప్రయాణానికి అతి తక్కువగా రూ. 914కే టికెట్ ఆఫర్ చేస్తుండటం విశేషం.
వచ్చే మూడు నెలల్లో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉండటంతో దాదాపు 70 శాతం మంది ముందస్తు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారని ఎయిర్ ఏషియా సర్వేలో తేలింది. వారి ప్రయాణానికి ఉపయోగపడేలా ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్ను తీసుకొచ్చింది. 2021 జులైలో ఎయిర్ ఏషియా ఇండియా, ట్రావెల్ ఇంటెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఈ ఆఫర్లను ప్రకటించింది.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…