General News

రూ. 914కే విమాన ప్రయాణం.. బంపర్ ఆఫర్ ప్రకటించిన విమానయాన సంస్థ!

కరోనా కారణంగా ఒక్క రంగంలోనే కాదు.. ప్రతీ విభాగం నష్టపోయింది. ఆర్థిక రంగం దగ్గర నుంచి పర్యాటక రంగం వరకు అన్నిటింకీ నష్టాలు తప్పలేదు. ఈ కోవలోకే ప్రయాణాలకు సంబంధించిన విభాగాల్లో కూడా నష్టం తప్పలేదు. లాక్ డౌన్ కాలంలో ఇంటి దగ్గరే ఉండటంతో వాహనరంగం కూడా కుదేలైంది. ముఖ్యంగా విమాన రంగాన్ని కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ తీసింది.

అయినా కానీ ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఈ సంస్థ డొమెస్టిక్​ టికెట్​ ధరలపై అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఫ్లాష్​ సేల్​ పేరుతో ఈ ఆఫర్​ను​ ప్రారంభించింది. సేల్​లో భాగంగా విమాన టికెట్లను రూ. 914 ప్రారంభ ధరతో అందిస్తోంది. అయితే దేశీయ ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్​ ఏషియా స్పష్టం చేసింది.

అయితే ఇవి కేవలం 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణానికి మాత్రమే. వీటికి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 మధ్య అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అంటూ ప్రకటించారు. ఇంఫాల్ నుంచి కోల్‌కతా, ఇంఫాల్ నుంచి గౌహతి మార్గాల మధ్య ప్రయాణానికి అతి తక్కువగా రూ. 914కే టికెట్​ ఆఫర్​ చేస్తుండటం విశేషం.

వచ్చే మూడు నెలల్లో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు ఉండటంతో దాదాపు 70 శాతం మంది ముందస్తు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారని ఎయిర్​ ఏషియా సర్వేలో తేలింది. వారి ప్రయాణానికి ఉపయోగపడేలా ఈ ఫ్లాష్​ సేల్​ ఆఫర్​ను తీసుకొచ్చింది. 2021 జులైలో ఎయిర్ ఏషియా ఇండియా, ట్రావెల్ ఇంటెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఈ ఆఫర్లను ప్రకటించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

54 minutes ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

1 hour ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

3 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

3 hours ago

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…

4 hours ago

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…

4 hours ago