Akash Puri: చోర్ బజార్ హీరోయిన్ గెహ్నా సిప్పి మాటలకు హర్ట్ అయిన ఆకాశపూరి.. సారీ చెబుతున్నా అలా చేసిన ఆకాష్!
Akash Puri: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆకాష్ పూరి. అయితే ఏమాత్రం తండ్రి సహాయ సహకారాలు లేకుండా సొంతంగా తాను ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంటానని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఆకాష్ పలు సినిమాలలో నటించిన ఏది పెద్దగా బ్రేక్ ఇవ్వలేదని చెప్పాలి.తాజాగా చోర్ బజార్ సినిమా అయినా ఆకాష్ ఖాతాలో హిట్ గా నిలుస్తుందని అందరూ భావించారు అయితే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.
ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పూరి జగన్నాథ్ బండ గణేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇలా ఫోకస్ మొత్తం చోర్ బజార్ సినిమా పైకి వెళ్లిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా విజయం సాధించలేకపోయింది. ఇకపోతే చోర్ బజార్ చిత్ర బృందం సుమ క్యాష్ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా సుధీర్ ఆకాశ్ పూరిని దారుణంగా ఇరికించింది. పూరి జగన్నాథ్, బండ్ల గణేష్ ఇద్దరిలో ఎవరి కొటేషన్స్ నచ్చుతాయి అంటూ ఆకాష్ ను ప్రశ్నించింది. ఇదిలా ఉండగా హీరోయిన్ గెహ్నా సిప్పిని ప్రశ్నిస్తూ మీకు ఆకాష్ తో పని చేయడం ఇష్టమా లేక డైరెక్టర్ జీవన్ రెడ్డితో పని చేయడం ఇష్టమా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గెహ్నా సమాధానం చెబుతూ టక్కున జీవన్ రెడ్డి అని సమాధానం చెప్పింది.
ఈ విధంగా చోర్ బజార్ హీరోయిన్ ఆకాష్ పేరు కాకుండా డైరెక్టర్ పేరు చెప్పడంతో ఆకాష్ ఎంతో హర్ట్ అయ్యి వేదిక పైనుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి హీరోయిన్ తనకు సారీ చెబుతున్నా కూడా ఆకాష్ వేదికపై నుంచి బయటకు వెళ్ళాడు. అయితే ఆకాష్ నిజంగానే అలిగి బయటకు వెళ్ళాడా లేకపోతే ప్రోమో కోసమే ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…