Akhanda Movie: అఖండ రీమేక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి.. హిందీలో రీమేక్ చేస్తే వారితోనే చేస్తా అంటూ..!
Akhanda Movie: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను సందడి చేసింది. ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.అయితే నేడు మిరియాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ సినిమా విజయవంతం అవుతుందని నాకు ముందే తెలుసు.ఈ సినిమా విజయం గురించి దర్శకుడు హీరోలు ఎప్పుడూ మాట్లాడకపోయినా తాను మాత్రం సినిమా తప్పకుండా విజయం అవుతుందని ఎన్నోసార్లు వెల్లడించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు కావలసినంత మాస్ కంటెంట్ ఉంది ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని మొదట్లోనే భావించినట్లు తెలిపారు.
ఇక ఈ సినిమా ఈ సీక్వెల్ చిత్రాన్ని తీయాలనే కోరిక తనలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇకపోతే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలు అయితే ఈ కథకు సెట్ అవుతారనేది తన అభిప్రాయమని రవీందర్ రెడ్డి వెల్లడించారు.
తాను కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మంచి కథ దొరికితే చిన్న హీరోలతో కూడా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఒక కొత్త హీరోని తమ నిర్మాణంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరొక భారీ బడ్జెట్ మూవీ సంప్రదింపులలో ఉందని త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన విడుదల చేస్తామని ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…