Akhanda Movie: అఖండ రీమేక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి.. హిందీలో రీమేక్ చేస్తే వారితోనే చేస్తా అంటూ..!
Akhanda Movie: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను సందడి చేసింది. ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.అయితే నేడు మిరియాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ సినిమా విజయవంతం అవుతుందని నాకు ముందే తెలుసు.ఈ సినిమా విజయం గురించి దర్శకుడు హీరోలు ఎప్పుడూ మాట్లాడకపోయినా తాను మాత్రం సినిమా తప్పకుండా విజయం అవుతుందని ఎన్నోసార్లు వెల్లడించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు కావలసినంత మాస్ కంటెంట్ ఉంది ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని మొదట్లోనే భావించినట్లు తెలిపారు.
ఇక ఈ సినిమా ఈ సీక్వెల్ చిత్రాన్ని తీయాలనే కోరిక తనలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇకపోతే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలు అయితే ఈ కథకు సెట్ అవుతారనేది తన అభిప్రాయమని రవీందర్ రెడ్డి వెల్లడించారు.
తాను కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మంచి కథ దొరికితే చిన్న హీరోలతో కూడా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఒక కొత్త హీరోని తమ నిర్మాణంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరొక భారీ బడ్జెట్ మూవీ సంప్రదింపులలో ఉందని త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన విడుదల చేస్తామని ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి తెలియజేశారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…