Akhanda Movie: అఖండ రీమేక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి.. హిందీలో రీమేక్ చేస్తే వారితోనే చేస్తా అంటూ..!
Akhanda Movie: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను సందడి చేసింది. ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.అయితే నేడు మిరియాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ సినిమా విజయవంతం అవుతుందని నాకు ముందే తెలుసు.ఈ సినిమా విజయం గురించి దర్శకుడు హీరోలు ఎప్పుడూ మాట్లాడకపోయినా తాను మాత్రం సినిమా తప్పకుండా విజయం అవుతుందని ఎన్నోసార్లు వెల్లడించినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకు కావలసినంత మాస్ కంటెంట్ ఉంది ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని మొదట్లోనే భావించినట్లు తెలిపారు.
ఇక ఈ సినిమా ఈ సీక్వెల్ చిత్రాన్ని తీయాలనే కోరిక తనలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇకపోతే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలు అయితే ఈ కథకు సెట్ అవుతారనేది తన అభిప్రాయమని రవీందర్ రెడ్డి వెల్లడించారు.
తాను కేవలం స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా మంచి కథ దొరికితే చిన్న హీరోలతో కూడా సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఒక కొత్త హీరోని తమ నిర్మాణంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరొక భారీ బడ్జెట్ మూవీ సంప్రదింపులలో ఉందని త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన విడుదల చేస్తామని ఈ సందర్భంగా మిరియాల రవీందర్ రెడ్డి తెలియజేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…