Akhil Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం నుండి నాగేశ్వరరావు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున, నాగచైతన్య అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని వారసత్వం గురించి అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం అఖిల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన చిత్రం ‘ ఏజెంట్’. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన వీక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్ పనులతో అఖిల్ బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యులు, ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ అక్కినేని వారసత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ..” వారసుడిగా కంటే, అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తాను. ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే నాకు సంతోషం.
Akhil Akkineni: అక్కినేని వారసుడు కంటే అఖిల్ గా ఉండటమే ఇష్టం…
అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే అందులోకి వెళ్లిపోతాను. ప్రస్తుతం సినిమాల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. సక్సెస్ లు వచ్చినా, ఫెయిల్యూర్ అయినా చివరి దాకా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను” అని అఖిల్ చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం అఖిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఏజెంట్ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాని షేర్ చేస్తు సినిమా మీద అంచనాలు పెంచుతోంది.
రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ సంస్థ లీగల్…
ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…
బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్పై జైలు నుంచి…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…
ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…