Akhil: అక్కినేని వారసుడు అఖిల్ ఇటీవల ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా అఖిల్ అభిమానులకు నిరాశ మిగిల్చింది. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేదు . మొదటి మూడు సినిమాలు డిజాస్టర్ గా నిలువగా.. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంతవరకు పర్వాలేదనిపించింది.
ఇక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన లేదంటే సినిమా తాజాగా విడుదల అయ్యి డిజాస్టర్ గా మిగిలి అందరి అంచనాలు తారుమారు చేసింది. దీంతో అఖిల్ తో నాగార్జున కూడా చాలా నిరాశపడ్డాడు. అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా హిట్ అవ్వాలని ఇటీవల నాగార్జున అమల దంపతులు తిరుపతి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ కష్టపడి బాడీ బిల్డప్ చేసినప్పటికీ సినిమాలో స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోవడంతో సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది.
అఖిల్ మొదటి నుండి సినిమా సెలక్షన్ విషయంలో తప్పు మీద తప్పులు చేస్తూనే వస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అంటూ అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ అతని వారసులు అఖిల్ నాగచైతన్య మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాలు మాత్రం విఫలమవుతూనే ఉన్నాయి.
నాగచైతన్యకి అడపాదడపా హిట్లు పడినా కూడా అఖిల్ మాత్రం మొదటి నుండి ప్లాపులతోనే బండి లాగుతున్నాడు. దీంతో మీకు సినిమాలు సరిపడవు రిటైర్ అయిపోయి చక్కగా మీ తండ్రి వ్యాపారాలు చూసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ సినిమాలు చూస్తూ మాకు జండూబామ్ ఖర్చులు కూడా అధికమవుతున్నాయి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…