Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇటు సౌత్ లో కూడా ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. ఎంతో కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఇటీవల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలో కి అడుగుపెట్టారు.
వివాహం జరిగిన కొంత కాలానికి తల్లి కాబోతున్నట్లు ఆలియా ప్రకటించింది. ఇక ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తన కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కూతురి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే కాలం గడుపుతోంది. అయితే అప్పుడప్పుడు మీడియా ముందు మెరుస్తున్న ఈ బ్యూటీ తాజాగా అమెరికాలో జరిగిన ఫ్యాషన్ ఫెస్టివల్ మెట్ గాలాలో సందడి చేసింది.
అలియాభట్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది. 6 నెలల క్రితం తల్లి అయిన అలియా ఈవేడుకలలో చాలా ఫిట్గా, హాట్ గ్లామర్ లుక్తో సందడి చేస్తూ అభిమానుల హృదయాలను ఆకట్టుకుంది. ఇక ఈ ఫ్యాషన్ ఫెస్టివల్ లో అందరి చూపు ఆమె డ్రెస్పైనే పడింది. ఈ ఫెస్టివల్ లో ఆలియా ముత్యాల గౌనులో దేవతలా మంత్రముగ్ధులను చేసింది. అయితే మెట్ గాలా ఈవెంట్ కోసం అమెరికాకు వెళ్లిన ఆలియా తన గారాలపట్టి చిన్నారి కూతుర్ని బాగా మిస్ అవుతోంది. ఈ ఈవెంట్ కోసం ఆలియా తన కూతురికి నాలుగు రోజుల పాటు దూరంగా ఉంది.
ఈ క్రమంలో కూతురిని బాగా మిస్ అవుతున్నానంటూ ఆలియా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో మెట్ గాలా వేడుకకు రెడీ అవుతున్న సమయంలో తన కూతురు రాహా గురించి మాట్లాడుతూ…పాప పుట్టిన ఈ ఆరు నెలల కాలంలో నేను నా బిడ్డను 24గంటల కంటే ఎక్కువ సమయం విడిచి ఉండలేదని ..ఇప్పుడు ఉండాల్సి వచ్చిందని అలియాభట్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కూతురు మీద ఆలియాకి ఉన్న ప్రేమ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…