Actor Sharath Babu : విలక్షణ నటుడు విలన్ గాను, హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదాలవలసలో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకోక చిలుక, చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981, 88, 89 మూడు సార్లు ఉత్తమం సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న శరత్ బాబు గారి గురించి అయన బాల్య మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
బాల్యంలో కష్టాలు పడ్డాడు…
శరత్ బాబు గారు ఆముదాలవలసలో తన కుటుంబంతో ఉండేవారు. ఆయన పక్కింట్లోనే ఉండే ఆయన స్నేహితుడు సత్యనారాయణ గారు ఆయన గురించి మాట్లాడారు. శరత్ బాబూ స్వస్థలం కాన్పూర్ కాగా జీవనం కోసం ఆముదాలవలస వచ్చారు. మొత్తం పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు ఉండేవారట శరత్ బాబు గారి ఇంట్లో. మొదట్లో రైల్వే కాంటీన్ తీసుకుని పనిచేసేవారట. ఆపైన సొంతంగా హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారంటూ శరత్ బాబు కుటుంబ నేపధ్యం గురించి తెలిపారు సత్యనారాయణ. ఇక ఒకవైపు హోటల్లో కష్టపడుతూనే మరోవైపు చదువుకుంటూ ఉన్న శరత్ బాబు నటన మీద ఆసక్తితో డ్రామాలలో నటిస్తూ ఉండేవారట. అలా సినిమాలవైపు వెళ్లారంటూ ఆయన స్నేహితుడు సత్యనారాయణ తెలిపారు.
ఇక సినిమాల్లోకి వచ్చాక శరత్ బాబు తనకంటే నాలుగేళ్లు పెద్ధ అయిన సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారు పదనాలుగేళ్ల తరువాత విడాకులతో వేరయ్యారు. శరత్ బాబు గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ ఇలా పలు ఇతర భాషలలోనూ నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తండ్రి పాత్రలలోనూ ఒదిగిపోయారు. ఇక కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా రాక ముందు ఒకసారి ఆముదాలవలస వచ్చి తాను బాల్యంలో ఉన్న ఇంటిని అలాగే తన స్నేహితులను కలిసి వెళ్లారట శరత్ బాబు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…