Shaakuntalam: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం,విజువల్స్ నాసిరకంగా ఉండడంతో ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది . ఇక ఈ సినిమా సమంతకెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా గురించి సమంత స్పందిస్తూ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అంటూ భగవద్గీతలోని ఒక కొటేషన్ షేర్ చేసింది. దిల్ రాజు కూడా ఈ సినిమా మీద భారీ నమ్మకంతో నిర్మాతగా వ్యవహరించాడు. అయితే దిల్ రాజు పాతికేళ్ళ సినీ కెరీర్ లో కూడా శాకుంతలం భారీ దెబ్బ తీసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించాడు.
ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. అందువల్ల ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ అప్డేట్ కూడా తెరమీదకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల ఓటీటీ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ దరకే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా భారీ డిజాస్టర్ కావడంతో పాటు థియేటర్ల నుంచి సినిమాని తప్పించడంతో మే 12 వ తేదీ నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు సమాచారం. అయితే శాకుంతలం ఓటిటి రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడ లేదు. అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…