Ranbeer Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఏప్రిల్ 14వ తేదీ నటి అలియా భట్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహమైన అనంతరం వీరిద్దరు కలిసి సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన బ్రహ్మాస్త్రం సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
రణబీర్ బ్రహ్మాస్త్రతో పాటు ‘షంషేరా’ ట్రైలర్ విడుదల కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి.ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రణబీర్ కపూర్ అలియా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలియా తనకు రెండవ భార్య అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు తాను తన మొదటి భార్యను చూడలేదని ఆయన తన మొదటి భార్య గురించి అసలు విషయం చెప్పారు.
తాను కొన్ని సంవత్సరాల క్రితం తన పేరెంట్స్ తో కలిసికృష్ణరాజ్ బంగ్లాలో ఉండేవారట. ఈయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక అమ్మాయి పురోహితుడిని పిలుచుకొని ఏకంగా తన ఇంటి గేటు ముందు నిలబడి తన గేటుతో పెళ్లి చేసుకుందని, గేటుకు బొట్లు పెట్టి పూలమాలవేసి తను కూడా పూల మాల వేసుకుని పెళ్లి చేసుకుని వెళ్లిందని తెలిపారు.
అయితే ఆ సమయంలో తాను ఇంట్లోలేనని ఇంటికి వచ్చాక వాచ్ మెన్ ఈ విషయం చెప్పే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యానని రణబీర్ తెలిపారు.అయితే ఇప్పటివరకు ఆ అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అనే విషయం తనకు తెలియదని అయితే త్వరలోనే తనను కలుస్తానని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ తన మొదటి పెళ్లి గురించి తెలియజేశారు. ఇలా ఈయన పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…