Allu Arjun: సాధారణంగా మనం ఏదైనా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక కొన్నిసార్లు కంటతడి పెట్టుకుంటాము.మన గురించి ఎవరైనా ఎమోషనల్ గా చెప్పిన లేకపోతే ఏదైనా బాధాకర సన్నివేశాలు తెలిసిన వెంటనే కళ్ళ నుంచి నీళ్లు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా అల్లు అర్జున్ సైతం తన ఎమోషన్ ని దాచుకోలేక కంటతడి పెట్టుకున్నారు. ఇలా అల్లు అర్జున్ కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో.దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మూడేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శిరీష్ అను ఇమ్మానుయేల్ మధ్య ఉన్నటువంటి రొమాంటిక్ లవ్ సన్నివేశాలు, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకోనీ ఈ సినిమాకు మంచి హిట్ అందించారు. ఈ విధంగా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదికపై అల్లు అర్జున్ గురించి శిరీష్ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ కి తమ్ముడిగా పుట్టినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి. ఆయన నన్ను తమ్ముడిలా కాకుండా ఒక కొడుకుల ట్రీట్ చేస్తారు.
సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేస్తే ముందు మై బేబీ సిరి అంటూ పోస్ట్ చేస్తారని చాలా రోజుల తర్వాత అన్నయ్యను కలిస్తే కనుక బుగ్గలు గిల్లి తనని ముద్దు చేస్తారని శిరీష్ తెలిపారు. నేను జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అవేవీ మిగల్చకుండా అన్ని నాకోసం చేసి పెట్టారు. అందుకు అన్నయ్యకు థాంక్స్ అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన అన్నయ్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…