Allu Arjun:గణేష్ ఉత్సవాల నిమిత్తం సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు పెద్ద ఎత్తున వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి పెద్ద ఎత్తున పూజలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే గణేష్ నిమజ్జనం సందర్భంగా సెలబ్రిటీలు సైతం నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతి ఏడాది తన ఆఫీసులో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తూ అనంతరం తన టీమ్ మెంబర్స్ తో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు.అల్లు అర్జున్ వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
అయితే ఈసారి గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో సందడి చేశారు. ఈ విధంగా అల్లు అర్జున్ అర్హ దగ్గరుండి నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొనటమే కాకుండా స్వామివారి నిమర్జనానికి వెళ్లేముందు కొబ్బరికాయ కొట్టి అక్కడ తన టీమ్ మెంబర్స్ తో కలిసి చిందులు వేస్తూ సందడి చేశారు.
ఇక తన కూతురుకు వినాయక చవితి ప్రత్యేకతలు నిమజ్జనం గురించి తెలియజేశారు.ఇలా అల్లు అర్జున్ స్టార్ సెలబ్రెటీ అయినప్పటికీ ఈయన దగ్గరుండి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన సంప్రదాయాలను కూతురుకు వివరించారు. ఇలా అల్లు అర్జున్ ఈ వేడుకలలో పాల్గొనడం పట్ల చాలామంది ఈయన సంస్కృతి సాంప్రదాయాలకు ఇస్తున్న గౌరవం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…