Tollywood Stars: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అని చెప్పుకునే వారు అయితే ప్రస్తుతం అన్ని తారు మారయ్యాయి బాలీవుడ్ ఇండస్ట్రీ అని ఎంతో గొప్పగా చెప్పుకునే సెలబ్రిటీలు చివరికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు అంటే బాలీవుడ్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.
కరోనా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తిగా గడ్డుకాలం ఏర్పడిందని చెప్పాలి. భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఎన్నో సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేర్ చేస్తున్నాయని చెప్పాలి.
ఈ విధంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పూర్తి కష్టకాలంలో ఉంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు ఆసక్తి కనబరచడం గమనార్హం.
సినిమాల విషయంలో మాత్రమే కాదు..ఏకంగా యాడ్స్ విషయంలో కూడా బాలీవుడ్ సెలబ్రిటీలను టాలీవుడ్ సెలబ్రిటీలు బీట్ చేస్తున్నారని చెప్పాలి. సాధారణంగా ఓ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం స్టార్ సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటారు. గతంలో ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలలో బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున నటించేవారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసినటువంటి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ రష్మిక, మహేష్, సమంత వంటి సెలబ్రిటీలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు బాలీవుడ్ సెలబ్రిటీలతో కుదుర్చుకున్న అగ్రిమెంటు సైతం రద్దు చేసుకొని టాలీవుడ్ సెలబ్రిటీలకు అవకాశం కల్పిస్తున్నారు.ఇలా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా చివరికి యాడ్స్ విషయంలో కూడా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలను టాలీవుడ్ సెలబ్రిటీలు బీట్ చేస్తున్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…