Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నటువంటి అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అల్లుఅర్జున్ సినీ కెరియర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది.ఇక ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు.
అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వీరి గురించి అల్లు స్నేహ రెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా వారిలో ఉన్న నైపుణ్యాలను బయట పెడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇంత చిన్న వయస్సులో వీరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇకపోతే అల్లు వారసురాలిగా అల్లు అర్హ ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సమంత పాన్ ఇండియా స్థాయిలో నటించిన శాకుంతలం అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించారు. అదేవిధంగా ఈమె ఎన్నో విషయాలలో అద్భుతమైన మెలకువలు కలిగి ఉన్నారని నిరూపించుకుంది.ఇలా ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ ఉన్నటువంటి అర్హ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్హను నీ పేరేంటి అని ప్రశ్నించగా వెంటనే.. అల్లు అర్హ రెడ్డి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈమె పేరు విన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈమె తన తండ్రి సామాజిక వర్గానికి సంబంధించిన పేరు కాకుండా తన తల్లి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పేరు అల్లు అర్హ రెడ్డి అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ క్రమంలోనే కొందరు ఈ విషయం పై స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి తరం పిల్లలు రేపటి భవిష్యత్తు. అలాంటి పిల్లలకు మంచి విషయాలను నేర్పించాలి కానీ ఇలా ఇంత చిన్న వయసులోనే పిల్లలను కులం అనే రొంపిలోకి నెడుతూ వారికి సమాజ శ్రేయస్సు అనేది లేకుండా చేస్తున్నారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే మరికొందరు పిల్లలకు ఏం నేర్పుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…