Categories: FeaturedMovie News

అపోలోకి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన.. అల్లు అర్జున్!

శుక్రవారం సాయంత్రం మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలిసిన వెంటనే మెగా హీరోలు అందరూ ఆసుపత్రికి తరలివచ్చి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ అతను తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై అల్లు అర్జున్ స్పందించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం అందరికన్నా ముందుగా అల్లు అర్జున్ కి తెలిసిందని, ఆయనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారని, సాయి తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో అతను హైదరాబాద్ చేరుకోలేదని తెలిపారు. పుష్ప షూటింగ్ లో ఉన్న తనకు హైదరాబాద్ రావడం కుదరలేదని తెలిపారు. ఈ క్రమంలోనే నిత్యం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ విరామం దొరకడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే అపోలోకి వెళ్లి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియజేశారు. త్వరలోనే సాయి తేజ్ కోలుకొని డిశ్చార్జి అవుతారని తెలియజేశారు.ప్రస్తుతం అపోలోకి చేరుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago