Categories: FeaturedMovie News

అపోలోకి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన.. అల్లు అర్జున్!

శుక్రవారం సాయంత్రం మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలిసిన వెంటనే మెగా హీరోలు అందరూ ఆసుపత్రికి తరలివచ్చి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ అతను తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై అల్లు అర్జున్ స్పందించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం అందరికన్నా ముందుగా అల్లు అర్జున్ కి తెలిసిందని, ఆయనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారని, సాయి తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో అతను హైదరాబాద్ చేరుకోలేదని తెలిపారు. పుష్ప షూటింగ్ లో ఉన్న తనకు హైదరాబాద్ రావడం కుదరలేదని తెలిపారు. ఈ క్రమంలోనే నిత్యం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ విరామం దొరకడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే అపోలోకి వెళ్లి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియజేశారు. త్వరలోనే సాయి తేజ్ కోలుకొని డిశ్చార్జి అవుతారని తెలియజేశారు.ప్రస్తుతం అపోలోకి చేరుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఉదయం లేదా సాయంత్రం?.. సరైన వర్కౌట్ టైమ్ ఎంచుకోవడం ఇలా!

వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…

4 minutes ago

ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…

13 minutes ago

ఫ్రెష్ మటన్ ఎలా గుర్తించాలి?.. తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్!

వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…

19 minutes ago

ట్రోలింగ్‌ను జయించి టాప్ మార్కులు.. ప్రాచీ నిగమ్ స్ఫూర్తిదాయక గాథ

ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాచి…

1 hour ago

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. వ్యూహమా? సంకోచమా?

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…

1 hour ago

లక్నో జట్టులో కలకలం.. పంత్ కెప్టెన్సీపై జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…

1 hour ago