శుక్రవారం సాయంత్రం మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయం తెలిసిన వెంటనే మెగా హీరోలు అందరూ ఆసుపత్రికి తరలివచ్చి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ అతను తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై అల్లు అర్జున్ స్పందించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం అందరికన్నా ముందుగా అల్లు అర్జున్ కి తెలిసిందని, ఆయనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారని, సాయి తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో అతను హైదరాబాద్ చేరుకోలేదని తెలిపారు. పుష్ప షూటింగ్ లో ఉన్న తనకు హైదరాబాద్ రావడం కుదరలేదని తెలిపారు. ఈ క్రమంలోనే నిత్యం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ విరామం దొరకడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే అపోలోకి వెళ్లి సాయిధరమ్ తేజ్ ను పరామర్శించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియజేశారు. త్వరలోనే సాయి తేజ్ కోలుకొని డిశ్చార్జి అవుతారని తెలియజేశారు.ప్రస్తుతం అపోలోకి చేరుకున్న అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…