శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనికి చికిత్స నిమిత్తం అక్కడే ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయి తేజ్ ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ ఆస్పత్రికి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించారు.
ఈ విధంగా మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందిస్తూ..ఆయన ఈ ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ విధంగా మెగా హీరోకు రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినప్పటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటమే కాకుండా ఈ రోడ్డు ప్రమాదం పై స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా ఆయన పై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే మెగా కుటుంబంలో మొదటగా అల్లు అర్జున్ కే ఈ విషయం తెలియడంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఎక్కడో షూటింగ్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కు ఈ ప్రమాదం గురించి ఎలా తెలిసింది అనే విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆస్పత్రిలో అల్లు అర్జున్ సన్నిహితులు ఉండడంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ కి చేరవేయగా అల్లు అర్జున్ తమ కుటుంబ సభ్యులకు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయాన్ని తెలియజేశారు. అయితే తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అల్లుఅర్జున్ షూటింగ్ లోనే ఉండిపోయారు. తనకు ఏమాత్రం కాళీ దొరికిన వెంటనే హైదరాబాద్ చేరుకొని తేజ్ ను పరామర్శించాలానే ఆలోచనలో అల్లుఅర్జున్ ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…