సాధారణంగా మహిళల పట్లఎంతో నీచంగా ప్రవర్తించే మానవ మృగాలు ఎలాంటి పరిస్థితులు ఉనప్పటికీ మహిళల పట్ల ఏమాత్రం జాలి, దయ లేకుండా మహిళల పట్ల దారుణానికి పాల్పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో కారొనతో బాధపడుతున్న ఓ మహిళ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్తున్న మహిళను అంబులెన్స్ లోనే అటెండెంట్ ఆమె పట్ల నీచమైన చర్యలకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కరోనా సోకిన బాధిత మహిళ పెరింతల మన పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్లో ల్యాబ్కు తరలించమని చెప్పగా అంబులెన్స్ లో ఆ మహిళ పట్ల అటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక కూడా వేధించాడు.
కరోనాతో ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న మహిళ అప్పుడు ఏమి చేయలేకపోయింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆంబులెన్స్ లో అటెండెంట్ తన పట్ల వ్యవహరించిన తీరును వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పగా.. సదరు మహిళ అటెండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…