సాధారణంగా మహిళల పట్లఎంతో నీచంగా ప్రవర్తించే మానవ మృగాలు ఎలాంటి పరిస్థితులు ఉనప్పటికీ మహిళల పట్ల ఏమాత్రం జాలి, దయ లేకుండా మహిళల పట్ల దారుణానికి పాల్పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో కారొనతో బాధపడుతున్న ఓ మహిళ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్తున్న మహిళను అంబులెన్స్ లోనే అటెండెంట్ ఆమె పట్ల నీచమైన చర్యలకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కరోనా సోకిన బాధిత మహిళ పెరింతల మన పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్లో ల్యాబ్కు తరలించమని చెప్పగా అంబులెన్స్ లో ఆ మహిళ పట్ల అటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక కూడా వేధించాడు.
కరోనాతో ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న మహిళ అప్పుడు ఏమి చేయలేకపోయింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆంబులెన్స్ లో అటెండెంట్ తన పట్ల వ్యవహరించిన తీరును వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పగా.. సదరు మహిళ అటెండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…