Featured

Amma Rajashekhar : జేడి చక్రవర్తిని పెట్టి సినిమా తీస్తే కథ, టైటిల్ తో సహా అన్నీ మార్చేసాడు.. చివరికి మా అమ్మ హాస్పిటల్లో ఉంటే నా దగ్గర డబ్బులు లేకుండా చేసాడు : అమ్మ రాజశేఖర్

Amma Rajashekhar : డాన్స్ మాస్టర్ గా సినిమాల్లో సక్సెస్ అయి సినిమా దర్శకులు గా మారిన వారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. తెలుగులో గోపీచంద్ తో తీసిన ‘రణం’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మంచి హిట్ అందుకున్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత వరుస ప్లాప్ లను చవిచూసి డైరెక్టర్ గా కెరీర్ డౌన్ కి వెళ్ళిపోయింది. ఆర్థికంగా కూడా నష్టాలను చూసిన అమ్మ రాజశేఖర్ తనను సినిమాల్లో చాలా మంది మోసం చేసారంటూ చెప్పాడు.

జేడీ చక్రవర్తి అలా అంతా మార్చేశాడు…

తన గురువుగా భావించే జే డి చక్రవర్తి మోసం చేసాడని ఆరోపించాడు. ప్రొడ్యూసర్ గా సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ నష్టపోతున్నపుడు మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళాను. ఒక కథ అనుకున్నాక జేడీ చక్రవర్తికి కథ వినిపించగా ఓకే అన్నాడు. ఇక ప్రొడ్యూసర్ కూడా కుదిరాక షూటింగ్ అంతా పూర్తయింది. ఇక సినిమాకు ఉగ్రమ్ అనే పేరు అనుకున్నాం. అయితే ప్రొడ్యూసర్ పక్కన ఉండే కాశి అనే వ్యక్తి జేడీ చక్రవర్తి అభిమాని అంటూ బాగా సోప్ వేసే వాడు. నేను చూసి పెద్దగా పట్టించుకోలేదు. పచ్చబొట్టు వేయించుకున్నా అంటూ చూపించాడు కూడా.

ఇక సినిమా అంతా పూర్తయ్యాక ప్రొడ్యూసర్ నక్షత్రకి కూడా అలానే మాటలు చెప్పి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక మళ్ళీ సినిమాలో ఎడిటింగ్ చేసి మళ్ళీ రీ రికార్డింగ్ చేసారు. హిందీ లో అరవై లక్షలకు సినిమా అమ్మేసిన తరువాత, ఇక టైటిల్ తో సహా అంతా మార్చారు, నాకు తెలియకుండా ఇదంతా చేసారు. మూడు నెలల్లో పూర్తి అయిన సినిమాను మూడు సంవత్సరాలు చేసి సినిమాను నాశనం చేసారు. ఇక సినిమాకు నా షేర్ నాకు ఇవ్వలేదు. కనీసం ఒక పది లక్షలు ఇవ్వమన్నా ఇవ్వలేదు. మా అమ్మ కి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉన్నపుడు డబ్బు అడిగినా ఇవ్వలేదు. నా గురువు కాబట్టి జేడీ చక్రవర్తిని వదిలేసాను ఈ విషయంలో లేకపోతే గొడవ జరిగేది.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

2 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

2 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

2 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

2 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

3 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

3 hours ago