Analyst Damu Balaji : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మహిళా అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ వాలంటీర్ల నుండి వచ్చే డేటాతో అక్రమ రవాణా జరుగుతోందని కామెంట్స్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ధర్నాలు సాగుతున్నాయి. వారితో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. నిరసనలో భాగంగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక తాజాగా మహిళా వాలంటీర్లు చేస్తున్న నిరసనను వీర మహిళలు అడ్డుకోవడం, గొడవ ఇవన్నీ నేడు వైరల్ అవుతున్నయంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

వాలంటీర్ల మీద వీర మహిళల దాడి…
పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలకు నిరసనగా రాష్ట్రావ్యాప్తంగా మహిళా వాలంటీర్లు ధర్నాలు చేస్తూ పవన్ దిష్టి బొమ్మను తాగులబెట్టారు. అయితే ఇటు నుండి జనసేన మహిళా కార్యకర్తలు వారి మీద దాడి చేయడం పట్ల బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యాలను వెనక్కి తీసుకోకపోగా సమర్తించికుంటున్నారు.

ఒక వ్యవస్థ మీద నింద వేశారు వాటికి ఆధారాలు చూపడం లేదు. కేవలం కేంద్ర నిఘా వర్గాలు నా చెవిలో చెప్పాయి అంటూ మొత్తం వాలంటీర్లను మహిళా అక్రమ రావాణాకు సహకరిస్తున్నారు అంటూ రాజకీయ లబ్ది కోసం విమర్శించడం తప్పు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.


































