Analyst Damu Balaji : సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తానే చంపినట్లు పోలీవుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెలుస్తోంది. అప్సర బ్యాక్ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మొదటి భర్త మరణం, ఆపైన హైదరాబాద్ కి తల్లి కూతుళ్ళు రావడం, ఇక్కడ సాయికృష్ణ తో ఎఫైర్ వంటి విషయాల మీద ఇప్పటికే పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా పోలీసులు సాయి కృష్ణ అప్సర ను ఎలా హత్య చేసాడు. ఆమెను ఎలా మాన్ హోల్ లో వేసి సాక్ష్యాలు లేకుండా చేసాడో రీ కన్స్ట్రక్షన్ కార్యక్రమం చేసారు. ఇక ఈ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
సాయికృష్ణ పై గుర్రుగా ఉన్న స్థానికులు…
సాయికృష్ణ హత్య అనంతరం అప్సర శవాన్ని శంషాబాద్ నుండి సరూర్ నగర్ కు కారులో తీసుకువచ్చి కారులో శవాన్ని ఉంచి సరూర్ నగర్లో దేవుడి పూజ కార్యక్రమాలు, బొడ్డురాయి పునఃప్రతిష్ట వంటి క్రతువులను చేయడంతో అక్కడి జనాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలతో సాయికృష్ణ ఆడుకున్నట్లుగా చాలా మంది భావిస్తున్నారని ఇప్పటికే శుద్ధి కార్యక్రమాలను చేసారు.
హత్య నేరం ఒప్పుకోవడం అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటివి నేరాలుగా సాయికృష్ణ కు శిక్ష పడుతుంది. అయితే అతని ఆత్మహత్య చేసుకుంటానంటూ పలు సార్లు అనడం ఇక ఒకసారి ప్రయత్నించడం చేసాడని వినిపిస్తోందని బాలాజీ తెలిపారు. అప్సర గతంలో ఒకరు చనిపోడానికి కారణమైందనే కథనాల వల్ల సాయికృష్ణ నేరానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…