Analyst Damu Balaji : నిత్యానంద స్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా ఉండే నిత్యానంద ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. అయితే నవంబరు 2019లో భారతదేశం వదిలి నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. నిత్యానందను దేశంలో విమర్శించే వారితో పాటు పరమ శివుడు రూపం అంటూ దైవ భక్తితో మొక్కే వారు కూడా ఉన్నారు. అందులో నటి రంజిత ముందుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక దేశం వదిలాక నిత్యానంద అసలు ఎక్కడా కనిపించలేదు. ఆయన దేశంలో ఇపుడు కొత్త ప్రధానిగా రంజిత పేరు వినిపిస్తుండగా ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషణ అందించారు.
రంజిత ప్రధాని అయితే నిత్యానంద మరణించాడా…
కైలాస దేశం అంటూ ఒకటి పెట్టి ఆ దేశం హిందూ దేశమంటూ అక్కడికి వెళ్లాలంటే వీసా పాస్పోర్ట్ కావాలంటూ నియమాలను పెట్టి మొన్నామధ్య యూఎన్ఓ లో కూడా ఆ దేశ ప్రతినిధి అంటూ ఒక ఆమె ప్రసంగించడం జరిగిందని బాలాజీ తెలిపారు. అయితే చాలా రోజులుగా నిత్యానంద బయట కనిపించకపోవడం వల్ల అతను మరణించాడనే వార్తలు బాగా వినిపించాయి. తాజాగా ఆయన శిష్యులలో ముఖ్యురాలైన రంజిత కైలాస దేశానికి ప్రధాన మంత్రి అంటూ ప్రచారం జరుగుతుందటం చూస్తుంటే నిత్యానంద లేడనే అనిపిస్తోందని తెలిపారు బాలాజీ. మొదటగా రంజిత ప్రధాని అనే విషయం ఒక తమిళ పత్రికలో రాగా దాంతో న్యూస్ వైరల్ అయింది.
ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా నిత్యానంద బోధనలు అలాగే రంజిత ప్రధాని అనే విషయాలు వీడియోల రూపంలో ఉన్నాయ్. ఆమె నటిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి సన్యాసిని అయ్యేవరకు ఉన్న మార్పు ఒక వీడియోలో ఉంది అంటూ బాలాజీ తెలిపారు. నిత్యానందమయి స్వామి గా రంజిత పేరు కనిపిస్తుంది ఆ వీడియోలలో అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…