Madhu Bala: తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకానొక సమయంలో అగ్రతారగా ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి సీనియర్ తారాలలో మధుబాల ఒకరు.ఈమె ఇండస్ట్రీలో దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అతి తక్కువ సమయంలోనే మధుబాల ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె చాలాకాలం తర్వాత తిరిగి మరీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ మధుబాల ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తాను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని తెలిపారు ఇలా బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనంతరం తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.
ఇకపోతే ఒకానొక సమయంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నటువంటి బాలీవుడ్ సినిమాలో తనకు హీరో తల్లి పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఇలా హీరోకి తల్లి పాత్ర అనగానే తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.తాను అజయ్ దేవగన్ ఇద్దరు ఓకే వయసు వాళ్లమే ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం అలాంటిది తనకు నేను తల్లిగా నటించడం ఏంటి అని తాను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.
ఇక కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ఇండస్ట్రీలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలనుకున్నాను. అయితే ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలనుకోవడానికి కారణం ఏంటి అని ఆలోచించగా పెళ్లి కనిపించింది అందుకే తాను ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాను. ఈ విషయాన్ని తెలిసినటువంటి వారందరికీ సినిమాలలో నటించనని లెటర్స్ రాసేసి ఇండస్ట్రీకి దూరమయ్యానని మధుబాల ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…