Analyst Damu Balaji : సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తానే చంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెలుస్తోంది. అప్సర బ్యాక్ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మొదటి భర్త మరణం, ఆపైన హైదరాబాద్ కి తల్లి కూతుళ్ళు రావడం, ఇక్కడ సాయికృష్ణ తో ఎఫైర్ వంటి విషయాల మీద ఇప్పటికే పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా పోలీసులు సాయి కృష్ణ అప్సరను ఎలా హత్య చేసాడు, ఆమెను ఎలా మాన్ హోల్ లో వేసి సాక్ష్యాలు లేకుండా చేసాడో రీ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరపనున్నారు. ఇక ఈ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
సీన్ రీ కన్స్ట్రక్షన్ అంటూ ఎన్కౌంటర్ చేస్తారా…
దాము బాలాజీ మాట్లాడుతూ సాయి కృష్ణ నేరం ఒప్పుకున్నా మెటీరియల్ సాక్ష్యం కోసం పోలీసులు హత్య ఎలా చేసాడు, ఆపైన ఎలా శవాన్ని పూడ్చాడు. సాక్ష్యాలను ఎలా ధ్వంసం చేసాడు వంటి విషయాలను డమ్మి బొమ్మను హత్య చేయించి మరోసారి సంఘటనను రీ కన్స్ట్రక్షన్ చేయిస్తారు. ఆ వీడియోను కోర్టులో సాక్ష్యంగా పోలీసులు ప్రవేశపెడతారు.
ఇక సాయికృష్ణ తెల్లవారుజామున మూడు ఆ ప్రాంతంలో హత్య చేయడం వల్ల అదే సమయంలో పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ చేయించబోతున్నారు. అతడిని ఎన్కౌంటర్ చేస్తారు అంటూ బయట కథనాలు వినిపిస్తున్నా ఆ విషయంలో క్లారిటీ లేదంటూ బాలాజీ తెలిపారు. ఇప్పటికే నేరం అంగీకరించిన సాయి కృష్ణ తనకు ఎవరైనా సహకరించారా లేక ఒక్కడే మొత్తం చేశాడా అనేది రీ కన్స్ట్రక్షన్ లో తెలిసిపోనుంది అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…