Analyst Damu Balaji : సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తానే చంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెలుస్తోంది. అప్సర బ్యాక్ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మొదటి భర్త మరణం, ఆపైన హైదరాబాద్ కి తల్లి కూతుళ్ళు రావడం, ఇక్కడ సాయికృష్ణ తో ఎఫైర్ వంటి విషయాల మీద ఇప్పటికే పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా పోలీసులు సాయి కృష్ణ అప్సరను ఎలా హత్య చేసాడు, ఆమెను ఎలా మాన్ హోల్ లో వేసి సాక్ష్యాలు లేకుండా చేసాడో రీ కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరపనున్నారు. ఇక ఈ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సీన్ రీ కన్స్ట్రక్షన్ అంటూ ఎన్కౌంటర్ చేస్తారా…
దాము బాలాజీ మాట్లాడుతూ సాయి కృష్ణ నేరం ఒప్పుకున్నా మెటీరియల్ సాక్ష్యం కోసం పోలీసులు హత్య ఎలా చేసాడు, ఆపైన ఎలా శవాన్ని పూడ్చాడు. సాక్ష్యాలను ఎలా ధ్వంసం చేసాడు వంటి విషయాలను డమ్మి బొమ్మను హత్య చేయించి మరోసారి సంఘటనను రీ కన్స్ట్రక్షన్ చేయిస్తారు. ఆ వీడియోను కోర్టులో సాక్ష్యంగా పోలీసులు ప్రవేశపెడతారు.

ఇక సాయికృష్ణ తెల్లవారుజామున మూడు ఆ ప్రాంతంలో హత్య చేయడం వల్ల అదే సమయంలో పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ చేయించబోతున్నారు. అతడిని ఎన్కౌంటర్ చేస్తారు అంటూ బయట కథనాలు వినిపిస్తున్నా ఆ విషయంలో క్లారిటీ లేదంటూ బాలాజీ తెలిపారు. ఇప్పటికే నేరం అంగీకరించిన సాయి కృష్ణ తనకు ఎవరైనా సహకరించారా లేక ఒక్కడే మొత్తం చేశాడా అనేది రీ కన్స్ట్రక్షన్ లో తెలిసిపోనుంది అంటూ బాలాజీ తెలిపారు.





























