Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం, తాజాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ తాజాగా కోర్ట్ లో అవినాష్ తరుపు లాయర్ సుమారు ఐదు గంటల పాటు వాదనలు వినిపించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
సిబిఐ తప్పుడు విచారణ జరుపుతోంది…
వివేకానంద రెడ్డి కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి ని సిబిఐ టార్గెట్ చేస్తోందంటూ వాదనలు వినిపిస్తున్నా తాజాగా హై కోర్ట్ లో అవినాష్ రెడ్డి తరుపు లాయర్ కూడా ఈ వాదననే లేవనెత్తారు. మొదటి నుండి కేసులో నేనే వివేకానంద రెడ్డిని చంపాను అని చెప్పిన దస్తగిరి వాంగ్మూలంను వదిలేసి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ల మీద సిబిఐ టార్గెట్ చేసిందని వివరించారు. సుమారు ఐదు గంటల పాటు వాదించిన ఉమామహేశ్వరావు గారు కీలక విషయాలను ప్రస్థావించారని అనలిస్ట్ దాము బాలాజీ పేర్కొన్నారు.
మొదటి నుండి అవినాష్ అరెస్టు కోసం అలాగే భాస్కర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి లకు బెయిల్ రాకుండా సునీత అడ్డుపడుతోంది కానీ తానే చంపాను అని చెబుతున్న దస్తగిరి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నా సునీత ఎందుకు పట్టించుకోలేదు అంటూ వాదించారు. అదీ కాక కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ లో అవినాష్ పేరు, భాస్కర్ రెడ్డి పేర్లు లేకపోయినా కోర్ట్ కి సమర్పించిన వాటిలో చేర్చడం వెనుక కుట్ర దాగుందని తెలిపారు ఉమామహేశ్వర్ రెడ్డి. కేసులో సిబిఐ ఏక పక్షంగా విచారణ సాగిస్తోందని కోర్ట్ కి తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…