Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్, ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం, తాజాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ తాజాగా కోర్ట్ లో అవినాష్ తరుపు లాయర్ సుమారు ఐదు గంటల పాటు వాదనలు వినిపించారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నీ హద్ధుల్లో ఉండు అంటూ సునీత కి చివాట్లు…
హై కోర్ట్ లో సుధీర్ఘంగా సాగిన వాదనలలో అవినాష్ తరుపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు గారు దాదాపు ఆయనకు రెండు గంటల సమయం కేటాయించగా సుధీర్ఘంగా ఆయన ఐదు గంటలు వాదనలు వినిపించారు. అందులో సునీత ఏ విధంగా పిటిషన్స్ వేస్తూ ఇంప్లీడ్ అవుతోంది, అసలు నిందితులను ఎందుకు స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు అంటూ సిబిఐ అలాగే సునీత టార్గెట్ గా వాదించారు. అయితే ఆయన వాదనలు అయిపోయాక సునీత తరుపు న్యాయవాది రవిచంద్ర వాదనలు వినిపించే సమయంలో సునీత మధ్యలో జడ్జి గారిని మాకు అవినాష్ తరుపు లాయర్ కి ఇచ్చిన సమయం ఇవ్వాలని అడిగారట.
దీంతో జడ్జి కోపడ్డారని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసారని బాలాజీ తెలిపారు. ఆమె తరుపు న్యాయవాది సమయం ఎక్కువ ఇవ్వాలని అడిగితే ఒకరకంగా ఉండేది కానీ సునీత అడగడం అగ్రహాన్ని తెప్పించి ఉండవచ్చు అంటూ చెప్పారు. సునీత మొదటి నుండి కేసులో పిటిషన్స్ వేయడం, బెయిల్ పిటిషన్స్ లో ఇంప్లీడ్ అవడం చేస్తూ కొంచం ఆతృత్తగా ఉన్నట్లు కనిపిస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…