Naresh: నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు నిజ జీవితంలో సహజీవనం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల అయింది.
నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మళ్లీ పెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.
ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ తనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదని వారికి కూడా మా రిలేషన్ ఇష్టమేనని తెలియజేశారు. ఇక వీరి వ్యవహారంలోకి మహేష్ బాబు పేరుని కూడా లాగడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈయన మరోసారి మళ్లీ పెళ్లి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేస్తున్నామని తెలిపారు.
మే 31వ తేదీ కృష్ణగారి 81వ జయంతి వేడుక కావడంతో తన మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తాను అంటూ ఈయన కృష్ణ గారికి గురించి ప్రస్తావన తీసుకురావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాని కృష్ణ గారికి అంకితం చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…