Featured

Analyst Damu Balaji : శివ శంకర్ రెడ్డిని ఆయన భార్య పదే పదే ఎందుకు కలుస్తోంది… అప్రూవర్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది ఎవరు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి మరణం 2019లో ఎన్నికల ముందు సంచలనం సృష్టించింది. మొదట గుండెపోటు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసినా తరువాత రాజకీయ హత్యగా తేల్చారు. అలా అనేక మలుపులు తిరుగుతూ కేసులో ప్రధాన నిందితులుగా దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కేసులో చేర్చారు సిబిఐ అధికారులు. అయితే కేసులో ఒక్క అడుగు ముందుకు పడలేదు కానీ ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతూ ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా శివ శంకర్ రెడ్డి విషయంలో సిబిఐ నుండి అప్రూవర్ గా మారమని ఒత్తిడి జరుగుతోందనే కథనాలు వినిపిస్తున్నాయి, వీటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జైలులో ఉన్న శివ శంకర్ రెడ్డి అప్రూవర్ గా మారేనా…

దాము బాలాజీ మాట్లాడుతూ శివ శంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితుడిగా ఉండగా దస్తగిరి కథనం ప్రకారం ఎర్ర గంగిరెడ్డికి డబ్బు ఇస్తానని శివ శంకర్ రెడ్డి చెప్పారు. అలా ఈ కేసులో శివ శంకర్ రెడ్డి నిందితుడిగా మారాడు. ఇక ఆయన భార్య తులసమ్మ వల్లే కేసులో సిబిఐ అధికారి రామ్ సింగ్ ను సుప్రీం కోర్ట్ మార్చింది. అలాగే వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన రెండో పెళ్లి గురించి మొదట చెప్పింది తులసమ్మనే.

ఆమె కథనం ప్రకారం షమీమ్ ను పెళ్లి చేసుకోవడం వారికి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయాలతో పాటు హత్య జరిగిన రోజు ఏవో కాగితాలను వెతికారని, ఆస్తి కోసమే హత్య జరిగింది అనే కోణంలో తులసమ్మ చెప్పడం జరిగింది అంటూ బాలాజీ తెలిపారు. ఇక శివ శంకర్ రెడ్డికి బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుపడటం వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్లపల్లి జైలులో శివ శంకర్ రెడ్డిని ములాఖత్ అవుతున్న తులసమ్మ ఆయనను అప్రూవర్ గా మారమని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అప్రూవర్ గా మారితే పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఆలోచిస్తున్నారంటూ బాలాజీ తెలిపారు. ఇదంతా సిబిఐ మైండ్ గేమ్ అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago