Featured

Analyst Damu Balaji : శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు కన్నుమూత… ఆయన జీవితం స్ఫూర్తి దాయకం…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అనగానే గుర్తొచ్చే కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ. ఈ కాలేజీలలో చదువంటేనే విద్యార్థులు జైలులో ఉన్నట్లు ఫీల్ అవుతారు. నిజానికి ఈ కాలేజీల మీద అన్ని విమర్శలు ఉన్నా ఎక్కువమంది తల్లిదండ్రులు ఆ కాలేజీలలో చేర్చడానికే మొగ్గుచూపుతారు. రెండేళ్లు కఠినంగా ఉండే అక్కడ చదివి బయటికి వస్తే పిల్లల జీవితం బాగుపడుతుందని భావిస్తారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో అనేక విమర్శలను ఎదుర్కోంటున్న శ్రీ చైతన్య కాలేజీ నుండి ఐఐటీ కి వెళ్లే విద్యార్థులు ఎక్కువ. దాదాపు 50% మంది ఐఐటీ లో శ్రీచైతన్య విద్యార్థులే ఉంటారని అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు. కాగా నేడు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు గారు కన్నుమూశారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన ఎందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రారంభించారు, అయన ప్రస్తానం గురించి బాలాజీ వివరించారు.

దేశ అభివృద్ధిలో భాగం కావాలని…

బిఎస్ రావు గారిది విజయవాడ వద్ద చిన్న పల్లెటూరు కాగా ఆయన డాక్టర్. ఆయన భార్య కూడా డాక్టర్ కాగా ఇద్దరూ మొదట్లో విదేశాలకు వెళ్లాలని భావించినా భరత దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావించి ఇక్కడే ఉండిపోయారు. ఇక 1986లో మొదటి సారిగా అమ్మయిల కళాశాల కోసం వెతుకగా మంచి కాలేజీ కనిపించలేదు. దీంతో కాలేజీ పెట్టాలనే ఆలోచనతో విజయవాడ లో కాలేజీ ఏర్పాటు చేసారు. మొదట 50 మందితో మొదలయిన శ్రీ చైతన్య కాలేజీ ఆపైన 1995 నాటికి 1000 మంది విద్యార్థుల వరకు చేరింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా కాలేజీని విస్తరించాలనే ఆలోచన అప్పట్లో కలగలేదు. ఇక 2004 నాటికి విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం బ్రాంచులను విస్తరించడం చేసారు. అలా నేడు వివిధ రాష్ట్రాల్లో శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి. ఆయన నిరంతరం విద్యాసంస్థల గురించే ఆలోచించడం వల్ల సోషల్ లైఫ్ కి దూరమాయ్యానని బాధపడుతారంటూ బాలాజీ తెలిపారు.

అందరూ శ్రీ చైతన్య కాలేజీ ని విమర్శించినా అక్కడే చదివించాలని తల్లిదండ్రులు భావిస్తారు. విద్యను కమర్షియల్ చేసారు అంటూ విమర్శల మీద అయన మాట్లాడుతూ ఫోన్ లేకుండా ఒక మూడేళ్లు విద్యార్థి ఉండగలిగితే జీవితంలో మంచి పొజిషన్ కి వెళ్తాడని నా నమ్మకం, అందుకే మా కాలేజీలో అంత కఠినంగా వ్యవహరిస్తాము. పేద విద్యార్థులకు ఉచితంగా సీటు ఇచ్చినప్పుడు వారి మీద తెలియకుండానే ఒత్తిడి ఉంటుంది దాన్ని అధిగమిస్తే విజయం సాధస్తారని, కొంతమంది పిల్లల ఆత్మహత్యలకు కారణం ఆ ఒత్తిడే అవడం బాధాకరం అంటూ ఆయన నిజాయితీగా నిజం ఒప్పుకున్నారు అంటూ బాలాజీ తెలిపారు. ఆయన 75 ఏళ్ల వయసులో అనారోగ్యం సమస్యలతో మరణించారని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago