Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా వివేకానంద హత్య కేసులో ఏ2 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి పరారీ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించగా తాజాగా ఆయన రేపు నాంపల్లి కోర్ట్ లో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. అసలు బెయిల్ గడువు ముగిసి పరారిలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్ట్ కి లొంగిపోడానికి కారణం ఏమిటి, ఎవరు చెబితే లొంగిపోతున్నాడు వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
లాయర్ సలహాతో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి…
వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం కీలకంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అందులో భాగంగానే దస్తగిరి చెప్పిన వారిలో ఎర్ర గంగిరెడ్డి ఉండటం వలన అతడిని సిబిఐ అరెస్టు చేయగా బెయిల్ మీద బయట ఉండగా తాజాగా బెయిల్ గడువు ముగిసింది. ఇక అజ్ఞాతంలో ఉంటూ ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్ట్ లో లొంగిపోమన్ని ఆయన లాయర్ సలహా ఇచ్చారట. లొంగిపోకుండా ఉంటే సిబిఐ మరో కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంది.
అనవసరమైన సమస్యలు తెచ్చుకోవడం కంటే లొంగిపోవడం ఉత్తమం అని, ఒకవేళ కోర్ట్ లో ట్రైయిల్ జరగక పోతే బెయిల్ మళ్ళి వస్తుంది అని కన్విన్స్ చేసి లొంగిపోయేలా చేశారట. నాంపల్లి కోర్ట్ లో త్వరలో హాజరువ్వబోతున్నారు. అయితే మొదటి నుండి కేసులో దస్తగిరి చెబుతున్న కథనే సిబిఐ కూడా ఫాలో అవుతోందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. లేదంటే సిబిఐ దస్తగిరిని వాడుకుంటూ ఈ కథ అల్లి అది ప్రచారం చేయమని చెప్పుండొచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…