డైరెక్టర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘హైవే’. ఈ సినిమా సైకో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై నిర్మాత వెంకట తలారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా షూటింగును తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో అద్భుతమైన లోకేషన్ లలో జరిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. డిఫరెంట్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని మంచి కథతో డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారని తెలిపాడు.
ఈ సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ అందిందని ఇక ఈ రోజే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపాడు. మూడు రాష్ట్రాలలో ఈ సినిమా అద్భుతంగా తీశామని తెలిపారు నిర్మాత వెంకట్. ఇక డైరెక్టర్ గుహన్ కూడా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా ఉందని అన్నాడు. ఈ కథలో ప్రతీది ట్విస్ట్ తో మలుపు తిరుగుతుందని బాగా ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్ లు తెలుపుతామని ప్రకటించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…