Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనన్య అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈమె సినిమా అవకాశాల కోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తూ ఉండేవారు. ఇకపోతే తాజాగా ఈమె తంత్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అనన్య ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిని కలిసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి దిగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఈమె తన సినిమా విడుదలకు ముందు వేణు స్వామిని కలవడం వెనుక కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
ప్రత్యేక పూజలు…
వేణు స్వామిని అనన్య క్యాజువల్ గా కలిసిందా లేకపోతే తాను నటిస్తున్నటువంటి తంత్ర సినిమా సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు చేయించడం కోసం ఈమె వేణు స్వామిని కలిసారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఏది ఏమైనా వేణు స్వామిని కలిసినటువంటి హీరోయిన్ల జాబితాలో అనన్య నాగళ్ళ కూడా చేరిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…