Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండిపోయారు.
ఇలా పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్టులు కారణంగా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. ఇలా నేటిజన్స్ తనని ట్రోల్ చేసినప్పటికీ ఈమె ఘాటుగా స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంది.
ఈ క్రమంలోనే లైగర్ సినిమా విడుదల సమయంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసినటువంటి పోస్ట్ పై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ భారీగా ట్రోల్ చేశారు. అప్పట్లో ఈ వివాదం సంచలనంగా మారింది. ఈ విషయంపై అనసూయ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా మరోసారి ఆంటీ వివాదం పై అనసూయ స్పందించారు.అభిమానులతో సరదాగా ముచ్చటించిన అనసూయకు ఒక అభిమాని నుంచి ప్రశ్న ఎదురయింది. ఎందుకు అక్క మీకు ఆంటీ అంటే అంత కోపం అంటూ అనసూయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ… తనకు ఆంటీ అనే పదం అసలు నచ్చదని తెలిపారు. ఎందుకంటే ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుందని ఈమె తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు కోపం రావడం లేదని ఎందుకంటే ట్రోలర్స్ ను చక్కదిద్దే అంత సమయం తనుకు లేదని అంతకన్నా ముఖ్యమైన పనులు తనకు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అనసూయ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…