Anasuya: నాకు పిల్లల్ని కనాలని ఉంది… ఆ విషయంలో తృప్తిగా లేనట్టు షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ?

Anasuya: బుల్లితెర యాంకర్ గా వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండి తెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అనసూయ శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కానీ పిల్లల విషయంలో అనసూయ తృప్తి పొందలేదని తెలుస్తుంది ఈమెకు ఇంకా పిల్లల్ని కనాలని ఉంది అంటూ తాజాగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారని కాకపోతే తనకు కూతురు కావాలని కోరిక ఎప్పటినుంచో ఉంది కానీ వీలు కాలేదు అంటూ అనసూయ తెలిపారు. తనకు కూతురు కావాలని కోరిక ఉందని ఆ కోరిక తీరలేదని ఈమె తెలిపారు.

కూతురు లేని లోటు ఉంది..

ఇద్దరు కొడుకులు పుట్టినప్పటికీ కూతురు లేదు అన్న అసంతృప్తి తనలో అలాగే ఉంది అంటూ పిల్లల గురించి అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఈమె మరోసారి ప్రెగ్నెంట్ అయ్యే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తాను మరొక బిడ్డకు కూడా జన్మనివ్వడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ థాంక్యూ బ్రదర్ సినిమా ప్రమోషన్ల టైం లో పిల్లల్ని కనడం గురించి కూడా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.