Anchor Rashmi: నటిగా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై అవకాశాలను అందుకునే పలు సినిమాలలో కూడా నటిస్తూ రష్మీ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే రష్మీ బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ ఈమెకు కమెడియన్ సుధీర్ తో ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి వార్తలు వచ్చేవి అయితే ప్రస్తుతం సుధీర్ ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ సుదీర్ రష్మిల రిలేషన్ గురించి ప్రస్తావనకు తీసుకురావడం గమనార్హం.అయితే త్వరలోనే ప్రేమికుల దినోత్సవం రానున్న నేపథ్యంలో మరోసారి రష్మీ సుధీర్ గురించి ఆది ప్రస్తావనకు తీసుకువచ్చారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా చెప్పు బుజ్జి కన్నా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చివర్లో హైపర్ ఆది FLAMES ఆడారు.
ముందుగా వర్ష ఇమ్మానియేల్ ఇద్దరి పేర్లను ఫ్లేమ్స్ చేయగా మ్యారేజ్ అని వచ్చింది అనంతరం హైపర్ ఆది రష్మీ సుధీర్ పేర్లను రాస్తూ ఫ్లేమ్స్ చేయబోతూ ఉండగా వెంటనే రష్మీ తన చేతిలో ఉన్న పేపర్ లాక్కొని చింపేయడమే కాకుండా అక్కడే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సుదీర్ ను గుర్తు చేసుకుంటూ రష్మీ కంటతడి పెట్టుకుందని పలువురు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…