జగన్ సర్కార్ సంచలనం.. ఖరీఫ్ పంటలకు ఉచిత బీమా..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు వరుస శుభవార్తలు చెబుతోంది. రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతుభరోసా, వైయస్సార్ జలకళ, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో శుభవార్త ద్వారా రైతులకు మేలు చేకూరేలా చేస్తోంది. జగన్ సర్కార్ ఖరీఫ్ పంటలకు కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తోంది.

రైతులు ఈ బీమా పొందడానికి అర్హులు కావాలంటే ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఐసీఎల్‌) 101 కోట్ల రూపాయల వాటా ధనంతో రైతులు నమోదు చేసుకున్న పంటలకు బీమాను అమలు చేయనుంది. గతేడాది గుర్తించిన ఉద్యాన పంటలతో పాటు వ్యవసాయ పంటలకు కూడా ఈ బీమా అమలు కానుంది. జనరల్‌ క్రాప్‌ ఎస్టిమేషన్‌ సర్వే (జీసీఈఎస్‌) ద్వారా ప్రభుత్వం ఈ పంట కోత ప్రయోగాల ను బట్టి క్లెయిమ్స్ ను పరిష్కరించనుంది.

రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్‌ గేజ్‌ స్టేషన్లు, ఐఎండీ వాతావరణ కేంద్రాలు వాతావరణ ఆధారిత పంటల బీమా పథాకానికి సంబంధించిన క్లెయిమ్స్ ను పరిష్కరించడంలో సహాయపడతాయి. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రైతుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా జగన్ సర్కార్ విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఉండటం గమనార్హం.

మరోవైపు ఈ ఏడాది వర్షాలు కూడా కురవడంతో రైతులకు పంటలు బాగా పండుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అందజేయడంతో పాటు గిట్టుబాటు ధరలకు ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago