Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!
Breaking News: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా భావిస్తున్న యూపీతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తేదీల్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
దీనిలో భాగంగానే.. దీనికి సంబంధించి ఎన్నికల తేదీలను ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని అత్యున్నత పోలింగ్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ రోజు ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
ఇక ఉత్తరప్రదేశ్ లో మొత్త 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మార్చిలో ఎన్నికల నిర్వహణ చేపట్టే అవకాశముంది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల నేపథ్యంలో యూపీతో పాటు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనా ఈ ప్రభావం పడబోతోంది.
దీంతో సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను ముగించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఈసీ కోరింది.
ఎన్నికలు జరిగే లోపు మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగైతేనే ఎన్నికల నిర్వహణ ద్వారా కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఇటీవల ఈ ఐదు రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు కుమార్ భల్లాతో సమీక్షించింది. ఈ సమావేశంలో రాజేష్ భూషన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఐసిఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ్ తదితరలు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ సంస్థ లీగల్…
ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…
బెయిల్పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్పై జైలు నుంచి…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…
ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…