Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

Breaking News: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా భావిస్తున్న యూపీతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తేదీల్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!
Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

దీనిలో భాగంగానే.. దీనికి సంబంధించి ఎన్నికల తేదీలను ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని అత్యున్నత పోలింగ్‌ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ రోజు ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

ఇక ఉత్తరప్రదేశ్ లో మొత్త 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మార్చిలో ఎన్నికల నిర్వహణ చేపట్టే అవకాశముంది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల నేపథ్యంలో యూపీతో పాటు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనా ఈ ప్రభావం పడబోతోంది.


సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను..

దీంతో సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను ముగించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఈసీ కోరింది.
ఎన్నికలు జరిగే లోపు మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగైతేనే ఎన్నికల నిర్వహణ ద్వారా కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఇటీవల ఈ ఐదు రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు కుమార్‌ భల్లాతో సమీక్షించింది. ఈ సమావేశంలో రాజేష్‌ భూషన్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ తదితరలు పాల్గొన్నారు.