వెటర్నరీ డాక్టర్ చనిపోయిన రెండు కోతులకు పోస్టుమార్టం నిర్వహించిన కొన్నిరోజులకు అతడు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా పశు వైద్యుడు మృతిచెందడంతో అతని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఎవరికీ ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు.
మంకీ బీ వైరస్ను మొట్టమొదటిసారిగా 1932లో కనుగొన్నారని, ఈ వైరస్ కనిపెట్టిన నాటి ఇప్పటివరకు కేవలం యాభై మరణాలు మాత్రమే సంభవించడం విశేషం. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందుతారు. ఈ వైరస్ ను మొట్ట మొదటిసారిగా మకాక్యూ అనే జాతికి చెందిన కోతులలో గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
మరొక విషయం ఏమిటంటే ఈ వైరస్ మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందక పోవడం ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వైరస్ ఎక్కువగా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బందికి మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.ఈ వైరస్ బారిన పడితే ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, కేవలం యాంటీవైరల్ మెడిసిన్స్తోనే ఈ వైరస్కి చికిత్స అందిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…