వెటర్నరీ డాక్టర్ చనిపోయిన రెండు కోతులకు పోస్టుమార్టం నిర్వహించిన కొన్నిరోజులకు అతడు తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా పశు వైద్యుడు మృతిచెందడంతో అతని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఎవరికీ ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు.
మంకీ బీ వైరస్ను మొట్టమొదటిసారిగా 1932లో కనుగొన్నారని, ఈ వైరస్ కనిపెట్టిన నాటి ఇప్పటివరకు కేవలం యాభై మరణాలు మాత్రమే సంభవించడం విశేషం. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్య సమస్యతో మృతి చెందుతారు. ఈ వైరస్ ను మొట్ట మొదటిసారిగా మకాక్యూ అనే జాతికి చెందిన కోతులలో గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
మరొక విషయం ఏమిటంటే ఈ వైరస్ మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందక పోవడం ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఈ వైరస్ ఎక్కువగా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బందికి మాత్రమే వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.ఈ వైరస్ బారిన పడితే ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, కేవలం యాంటీవైరల్ మెడిసిన్స్తోనే ఈ వైరస్కి చికిత్స అందిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…