Nagarjuna: చిరంజీవి మీద కోపంతోనే ఏఎన్నార్.. నాగార్జునను హీరో చేసారా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ గీతాకృష్ణ !

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసింది ఆయన వారసుడిగా నాగార్జున బాలనటుడిగా నటించి అనంతరం విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున అనంతరం మజ్ను, సంకీర్తన అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నారు.

Nagarjuna: చిరంజీవి గారి పై కోపంతోనే ఏఎన్నార్ గారు నాగార్జునను హీరో చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే సంకీర్తన సినిమా దర్శకుడు గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఈ సినిమాలో నాగార్జునను హీరోగా తీసుకోవడం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక ఈ సినిమా దర్శకుడిగా గీతాకృష్ణకు మొదటి సినిమా. ఈ సినిమాలోగీతాకృష్ణ నాగార్జున ని హీరోగా తీసుకోవడం కోసం కథను నాగేశ్వరరావుకి వినిపించారు.

Nagarjuna: చిరంజీవి గారి పై కోపంతోనే ఏఎన్నార్ గారు నాగార్జునను హీరో చేశారు.. డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

కథ విన్న నాగేశ్వరరావు చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో మా అబ్బాయి నటిస్తారని చెప్పారు.అలా సంకీర్తన సినిమాలో రమ్యకృష్ణ నాగార్జున నటించారని గీత కృష్ణ వెల్లడించారు.ఇకపోతే నాగార్జున నటించిన విక్రమ్ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రెండు మూడు సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి డేట్ల కోసం ఎదురుచూస్తూ అతని చుట్టూ తిరుగుతున్నారు.

చిరంజీవిపై కోపంతోనే..

మెగాస్టార్ డేట్స్ దొరకకపోవడం వల్ల విసుగు చెందిన నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున హీరోగా విక్రమ్ సినిమాని పరిచయం చేశారని ఈ సందర్భంగా గీత కృష్ణ వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి కోసం ఎదురు చూసి విసిగిపోయిన నాగేశ్వరరావు నాగార్జునను తన బ్యానర్లో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారనీ ఆయన వెల్లడించారు.