గత 10 నెలలుగా దేశంలోని ప్రజలు కరోనా గురించే చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు సైతం వైరస్ పేరు చెబితే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి సంబంధించి ఒక శుభవార్త చెప్పారు. కరోనా సోకకపోయినా కొందరిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.
వీరి శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించినా శరీరంలో ఉన్న యాంటీబాడీలు వైరస్ ను నిర్వీర్యం చేస్తాయని ఫలితంగా వారికి కరోనా సోకదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. పెద్దవాళ్లతో పోల్చి చూస్తే పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని అందువల్లే పిల్లలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
కొన్ని కరోనా వైరస్ లు సాధారణ జలుబుకు కారణమవుతాయని వాటి వల్లే పిల్లల్లో యాంటీబాడీలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు రక్త నమూనాల ద్వారా పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా విజృంభణకు ముందు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో సైతం యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఆరు నుంచి 16 ఏళ్ల మధ్యవాళ్లు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ప్రతి 20 మందిలో ఒకరికి కరోనా సోకకపోయినా యాంటీబాడీలు ఉన్నాయని అందువల్లే చాలా చోట్ల ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోయినా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ప్రజలకు ఏ విధంగా పంపిణీ చేయాలో కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…