Health News

శాస్త్రవేత్తల కీలక ప్రకటన.. వారికి కరోనా సోకదంట..?

గత 10 నెలలుగా దేశంలోని ప్రజలు కరోనా గురించే చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎవరికి వైరస్ సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు సైతం వైరస్ పేరు చెబితే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి సంబంధించి ఒక శుభవార్త చెప్పారు. కరోనా సోకకపోయినా కొందరిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.

వీరి శరీరంలో కరోనా వైరస్ ప్రవేశించినా శరీరంలో ఉన్న యాంటీబాడీలు వైరస్ ను నిర్వీర్యం చేస్తాయని ఫలితంగా వారికి కరోనా సోకదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. యూకేలోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. పెద్దవాళ్లతో పోల్చి చూస్తే పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని అందువల్లే పిల్లలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

కొన్ని కరోనా వైరస్ లు సాధారణ జలుబుకు కారణమవుతాయని వాటి వల్లే పిల్లల్లో యాంటీబాడీలు ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు రక్త నమూనాల ద్వారా పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా విజృంభణకు ముందు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో సైతం యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. ఆరు నుంచి 16 ఏళ్ల మధ్యవాళ్లు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ప్రతి 20 మందిలో ఒకరికి కరోనా సోకకపోయినా యాంటీబాడీలు ఉన్నాయని అందువల్లే చాలా చోట్ల ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోయినా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ప్రజలకు ఏ విధంగా పంపిణీ చేయాలో కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

1 hour ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago